పసుపు కంకుమగా 9361.12 కోట్లు - dwakra womens
94 లక్షల మంది కోసం 9361 కోట్ల రూపాయలు.

రాష్ట్రంలోని 94 లక్షల మంది డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ -2 పథకంలో భాగంగా ఆర్థిక సాయానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2018-19 బడ్జెట్ కేటాయింపుల నుంచి 9 వేల 3 వందల 61 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. 10 వేల రూపాయలను 3 విడతలుగా చెక్కుల రూపంలో ఇచ్చేందుకు ప్రణాళిక తయారుచేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో 2500, మార్చిలో 3000, ఏప్రిల్ లో 4000 రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించిన చెక్కులను ఒకేసారి ఈ నెల 2,3,4 తేదీల్లో పంపిణీ చేయనున్నారు.