వైకాపా నేతలు 5 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ను ఆత్మహత్యల ప్రదేశ్గా మార్చారంటూ తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర చరిత్రలో ఇన్ని ఆత్మహత్యాయత్నాలు ఎప్పుడైనా చూశామా అంటూ ప్రశ్నించారు. తెనాలిలో వైకాపా నేతల వేధింపులతో యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడంటూ మండిపడ్డారు. ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా రాష్ట్రంలో పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన పడకేశాయన్నారు. పెట్టుబడులు పెట్టేవాళ్లను బెదిరించి తరిమేశారని ఆరోపించారు. కొత్తగా ఉద్యోగాలు సృష్టించలేని వైకాపాకు తొలగించే హక్కు ఎక్కడిదంటూ చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు.
'వైకాపా నేతలు రాష్ట్రాన్ని ఆత్మహత్యల ప్రదేశ్గా మార్చారు' - ట్విట్టర్ స్పందించిన చంద్రబాబు
వైకాపా పాలనలో జరుగుతున్న ఆత్మహత్యలు తెదేపా అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన పూర్తిగా పడకేసిందని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

'వైకాపా నేతలు రాష్ట్రాన్ని ఆత్మహత్యల ప్రదేశ్గా మార్చారు'
'వైకాపా నేతలు రాష్ట్రాన్ని ఆత్మహత్యల ప్రదేశ్గా మార్చారు'
Last Updated : Nov 13, 2019, 3:47 PM IST