కృష్ణాజిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ మరణం బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ పటిష్టతకు ముందుండి కృషి చేసిన రాంజీ మృతి, తీరని లోటని లోకేశ్ అన్నారు. రాంజీ మరణం జీర్ణించుకోలేని విషయమన్న అచ్చెన్న.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తునన్నారు.
మాగంటి రాంజీ మృతికి సంతాపం తెలిపిన చంద్రబాబు - achennaidu latest news
కృష్ణాజిల్లా మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతికి తెదేపా నేతలు సంతాపం తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు.
రాంజీ మృతికి సంతాపం తెలిపిన తెదేపా నేతలు