ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 17, 2020, 6:42 PM IST

ETV Bharat / state

'తెదేపా నేతలపై పెట్టేవి అక్రమ కేసులే... ఇదిగో సాక్ష్యం'

వైకాపా నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లారీ యజమానులతో వైకాపా ఎంపీ సంభాషణకు సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు.

chandra babu
chandra babu

జేసీ ప్రభాకర్​రెడ్డి వద్ద లారీలు కొన్నామని చెప్పమంటూ లారీ యజమానులను వైకాపా ఎంపీ ఎగదోశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. తెలుగుదేశం నాయకులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని అన్నారు.

విలేకరుల సమావేశంలోనే ఇంత కుట్ర చేసిన వాళ్లు, తెరవెనుక ఇంకెన్ని చేస్తున్నారో ప్రజలే ఆలోచించాలని చంద్రబాబు కోరారు. ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగమేనని ధ్వజమెత్తారు. ప్రజలిచ్చిన అధికారాన్ని సొంత కక్ష సాధింపులకు వాడుకోవడం నేరమని హితవు పలికారు. అయ్యన్నపై కేసు వైకాపా కక్ష సాధింపునకు మరో రుజువు అని దుయ్యబట్టారు. బీసీ నాయకత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు వైకాపా కుట్ర పన్నిందని ఆరోపించారు. జగన్‌కు మొదట్నుంచీ బీసీలంటే కక్ష అన్న చంద్రబాబు... బీసీలు తెదేపాకు వెన్నెముకగా ఉన్నందుకే ప్రతీకారం తీర్చుకుంటున్నారని విమర్శించారు. ఈ బరితెగింపునకు ప్రజలే సరైన సమాధానం చెబుతారని.. సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించారు.

ఇదీ చదవండి'అచ్చెన్నాయుడికి అత్యున్నత వైద్యం అందించాలి'

ABOUT THE AUTHOR

...view details