ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగనన్న మీద అలక'.. డీఎస్సీ 2008 అభ్యర్థుల ఛలో విజయవాడ - vijayawada latest news

కాంట్రాక్ట్ పద్ధతిలో అంగీకారం తీసుకుని 7 నెలలు గడిచినా నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ డీఎస్సీ 2008 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. విజయవాడ ధర్నా చౌక్​లో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాదిగా అభ్యర్థులు హాజరయ్యారు.

నిరసన తెలుపుతున్న అభ్యర్థులు
నిరసన తెలుపుతున్న అభ్యర్థులు

By

Published : Nov 28, 2020, 4:04 PM IST

విజయవాడలోని ధర్నా చౌక్ లో డీఎస్సీ 2008 అభ్యర్థులు నిరసన చేపట్టారు. డీఎస్సీ 2008 లో నష్టపోయిన తమ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో అంగీకార పత్రాలు తీసుకొని 7 నెలలు గడిచినా.. నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని ఆందోళన చేపట్టారు.

చలో విజయవాడ, జగనన్న మీద అలక పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమానికి 2193 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రస్తుతం తమ దస్త్రం ఆర్థిక శాఖా ముఖ్య కార్యదర్శి రావత్ వద్ద ఉందని చెప్పారు. వెంటనే తమకు జాయినింగ్ ఆర్డర్లు ఇచ్చేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details