ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 26, 2020, 10:19 AM IST

ETV Bharat / state

పంట పొలాల్లో సిమెంట్ లారీ బోల్తా

పంటపొలాల్లో సిమెంట్ లారీ బోల్తా పడిన ఘటన కృష్ణా జిల్లా చాట్రాయి మండలం నరసింహారావు పాలెం వద్ద చోటుచేసుకుంది.

cement-lorry-overturns-in-crop-fields-in-krishna-district
పంట పొలాల్లో సిమెంట్ లారీ బోల్తా

కృష్ణాజిల్లా చాట్రాయి మండలం నరసింహారావు పాలెం వద్ద సిమెంట్‌ లోడ్​ తో వెళ్తున్న లారీ పంట పొలాల్లో బోల్తా పడింది. విసన్నపేట - సత్తుపల్లి రాష్ట్రీయ రహదారి అభివృద్ది పనులు చేస్తున్నందున వాహనాలను నరసింహారావు పాలెం వైపు దారి మళ్ళించారు. సింగిల్‌ రహదారి కావడంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో లారీ పంటపొలాల్లో బోల్తాపడింది. వరి పొలంలో సిమెంటు పడటంతో పంట నష్టం వాటిల్లింది. పక్కనే ఉన్న వ్యవసాయ కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. డ్రైవర్, క్లీనర్ బయటకు దూకేయడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

ABOUT THE AUTHOR

...view details