ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడివాడ నియోజకవర్గంలో జూద శిబిరాలపై దాడులు.. రూ.42 లక్షలు స్వాధీనం

కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజకవర్గంలోని పేకాట స్థావరాలపై స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. 30 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. భారీగా నగదుతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Jan 4, 2021, 4:59 AM IST

pokar players
గుడివాడ నియోజకవర్గంలో జూద శిబిరాలపై దాడులు

కృష్ణా జిల్లా గుడివాడ నియోజక వర్గం పరిధిలో నందివాడ మండలం తమిరిశ సమీపంలోని చేపలచెరువు గట్లపై నిర్వహిస్తున్న జూద శిబిరాలపై పశ్చిమగోదావరి జిల్లా ఎస్​ఈబీ ఏఎస్పీ జయకృష్ణరాజు నేతృత్వంలో పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు జరిపారు. రూ.42 లక్షల నగదుతోపాటు డబ్బులకు బదులుగా వాడే ప్లాస్టిక్​ టోకెన్లు లభించాయని ఏఎస్పీ తెలిపారు. 30 మంది జూదరులను అదుపులోకి తీసుకుని.. 20 కార్లు, 32 ద్విచక్ర వాహనాలు, 29 సెల్​ ఫోన్లని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మురళీ అనే వ్యక్తి ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆయన వెంట గుడివాడ డీఎస్పీ ఎన్. సత్యానందం తదితరులున్నారు.

ABOUT THE AUTHOR

...view details