కృష్ణా జిల్లా విజయవాడలో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం రహదారిపై గందరగోళం సృష్టించింది. మేరిస్టెల్లా కాలేజీ సిగ్నల్ వద్ద ఆ కారు.. మితిమీరిన వేగంతో రెండు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
'సిగ్నల్ జంప్ చేసి...ద్విచక్రవాహనాలను ఢీకొట్టాడు' - ap latest
విజయవాడలో ఓ కారు బీభత్సం చేసింది. సిగ్నల్స్ దాటొద్దని పోలీసులు వారిస్తున్నా..పట్టించుకోకుండా ద్విచక్రవాహనాలను ఢీకొట్టాడు..ఆ కారు డ్రైవర్. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.
పోలీసులు వారిస్తున్నా.. కారుతో ఢీకొట్టాడు