ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బిల్డింగ్ ప్లాన్ అనుమతుల కాల వ్యవధి పొడిగింపు

By

Published : Sep 23, 2020, 6:04 PM IST

పలు అనుమతులు, సర్టిఫికెట్ల కాల వ్యవధిని రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. కరోనా ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

ap government
ap government

రాష్ట్రంలో లేఅవుట్ ప్లాన్, బిల్డింగ్ ప్లాన్ అనుమతులు, కమెన్స్​మెంట్ సర్టిఫికెట్ల కాల వ్యవధిని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఆదేశాలు ఇచ్చారు.

కరోనా నేపథ్యంలో 2021 మార్చి 31 వరకు వ్యాలిడిటీని పొడిగించిది. ఈ ఏడాది మార్చి 25వ తేదీ తర్వాత గడువు ముగిసిన వాటికి మాత్రమే ఈ పొడిగింపు ఉత్తర్వులు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని కోసం ఎలాంటి రుసుం, దరఖాస్తు అక్కర్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details