కృష్ణా జిల్లా నాగాయలంకలో.. అత్తపై ఓ వ్యక్తి దారుణంగా దాడి చేశాడు. తన చెల్లెలు కాపురం చెదిరిపోవడానికి ఆమే కారణమన్న ఆగ్రహంతో అత్త విజయలక్ష్మి (45) గొంతు కోసి పారిపోయాడు. అవనిగడ్డ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. తృటిలో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
చెల్లెలి కాపురం చెదిరిపోయిందని... అన్న ఏంచేశాడో చూడండి! - latest crime news in krishna dst
తన చెల్లెలు కాపురం చెదిరిపోడానికి అత్త వేధింపులే కారణమని ఆగ్రహించిన అన్న... ఆ అత్త గొంతు కోశాడు. ఈ దారుణ ఘటన కృష్ణాజిల్లా నాగాయలంకలో జరిగింది.

చికిత్స పొందుతున్న బాధితురాలు