ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డ్రైనేజిలో పడి ఏడాదిన్నర బాలుడు మృతి - విజయవాడ వార్తలు

ఏడాదిన్నర బాలుడు డ్రైనేజిలో పడి మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

boy died falling into drainage in krishna district
డ్రైనేజిలో పడి ఏడాదిన్నర బాలుడు మృతి

By

Published : Feb 13, 2021, 4:29 AM IST

విజయవాడలోని నేతాజీ కాలనీలో విషాదం జరిగింది. ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి వెంకటరావు.. ఏడాదిన్నర కుమారుడు రుత్విక్ ఆడుకుంటూ.. వెళ్లి గృహానికి సమీపంలోని డ్రైనేజ్​లో ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఎవరు గమనించకపోవటంతో బాలుడు డ్రైనేజి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

బాలుడు కనింపించక పోవటంతో తల్లిదండ్రులు చట్టుప్రక్కల వెతకగా... బాలుడు డ్రైనేజీలో విగత జీవిగా కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

పసిబిడ్డ ప్రాణం తీసిన తల్లిదండ్రులకు యావజ్జీవ శిక్ష

ABOUT THE AUTHOR

...view details