ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కారు - ద్విచక్రవాహనం ఢీ.. బాలుడు మృతి

కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని శివయ్య పాకలు వద్ద కారు, ద్విచక్రవాహనం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు.

By

Published : Apr 29, 2021, 6:18 PM IST

Published : Apr 29, 2021, 6:18 PM IST

boy death in a road accident at gudivada krishna district
కారు-ద్విచక్రవాహనం ఢీ

కృష్ణా జిల్లా గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్ వైపు వెళ్తున్న కారు, పెద్దలింగాల నుంచి గుడివాడ వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న పండు అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. జాన్ బాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితుడిని గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details