రాజకీయాల్లో ఎంతోమంది పార్టీలు మారుతుంటారని.. కానీ వ్యక్తిగతంగా దూషించడం మంచి పద్ధతి కాదని వల్లభనేని వంశీని ఉద్దేశించి తెదేపా నేత బోడె ప్రసాద్ అన్నారు. వైకాపాలోకి పరకాయ ప్రవేశం చేసి.. వారి ఒత్తిళ్లతో వంశీ మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాను కూడా పార్టీ మారతానంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. అవసరమైతే రాజకీయాలు నుంచి తప్పుకుంటానే గానీ.. పార్టీ మాత్రం మారేది లేదని స్పష్టం చేశారు.
'రాజకీయాల నుంచి తప్పుకుంటాను... పార్టీ మారేది లేదు' - వల్లభనేని వంశీపై బోడె ప్రసాద్
వైకాపాలోకి పరకాయ ప్రవేశం చేసి.. వారి ఒత్తిళ్లతో వంశీ మాట్లాడుతున్నారని తెదేపా నేత బోడె ప్రసాద్ అన్నారు. తాను కూడా పార్టీ మారతానంటూ వస్తున్న వార్తలు అసత్యమని స్పష్టం చేశారు.
!['రాజకీయాల నుంచి తప్పుకుంటాను... పార్టీ మారేది లేదు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5081281-192-5081281-1573887162387.jpg)
వల్లభనేని వంశీపై బోడె ప్రసాద్