ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 3, 2020, 9:56 AM IST

ETV Bharat / state

తెలుగు యువత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

గాంధీ, లాల్​ బహదూర్​ శాస్త్రి జయంతి సందర్భంగా తెలంగాణ తెలుగు యువత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. హైదరాబాద్​ ఎన్టీఆర్​ ట్రస్ట్​ భవన్​లో జరిగిన ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​.రమణ పాల్గొన్నారు.

blood donation camp at ntr trust bhavan in hyderabad
తెలుగుయువత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

హైదరాబాద్​ ఎన్టీఆర్​ ట్రస్ట్​ భవన్​లో గాంధీ, లాల్​ బహదూర్​ శాస్త్రి జయంతి సందర్భంగా తెలంగాణ తెలుగు యువత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జయరాం చందర్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​.రమణ హాజరయ్యారు.

ఎన్టీఆర్​ స్ఫూర్తితో సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తలసేమియాతో బాధపడుతున్న వారికి రక్తం ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు రక్తదానం చేశారు.

ఇదీ చూడండి.దీటుగా స్పందిద్దాం...అపెక్స్ కౌన్సిల్ భేటీపై సీఎం నిర్దేశం

ABOUT THE AUTHOR

...view details