ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 2, 2021, 4:21 PM IST

ETV Bharat / state

సోమవారం రామతీర్థంలో నిరసన: సోము వీర్రాజు

సోమవారం రామతీర్థంలో నిరసన తెలపనున్నట్లు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు.

bjp somu veeraju on rama theertham  incident
bjp somu veeraju on rama theertham incident

దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో రాష్ట్ర భాజపా నేతల భేటీ ముగిసింది. జనసేనతో కలిసి వెళ్లే రాజకీయ వ్యూహాలపై చర్చించామని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. సోమవారం రామతీర్థం వెళ్లి.. నిరసన తెలపనున్నట్లు సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్రంలో రామతీర్థంలోనే కాదు, అన్ని ఆలయాలపైనా దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో భాజపా-జనసేన కలిసే పోటీ చేస్తాయని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details