ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నేతల అరెస్టులు దారుణం' - నూజివీడులో భాజపా నాయకుల అరెస్ట్

దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసన వ్యక్తంచేస్తున్న నేతలను, భక్తులను అరెస్ట్ చేయడం దారుణమని భాజపా నాయకులు నూతక్కి వేణుగోపాలరావు అన్నారు. ఈ విషయమై కృష్ణా జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు.

bjp leaders protest infront of nuzivid police station in krishna district
నూజివీడులో భాజపా నేతల నిరసన

By

Published : Sep 18, 2020, 11:36 AM IST

రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు, నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా భాజపా, జనసేన నేతలు కృష్ణా జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. భాజపా నియోజకవర్గ ఇన్​ఛార్జ్ నూతక్కి వేణుగోపాలరావు మాట్లాడుతూ.. అంతర్వేది, గుంటూరు, పిఠాపురం ఘటనలపై రాష్ట్రప్రభుత్వం సీబీఐ విచారణ చేపట్టాక.. విజయవాడ దుర్గ ఆలయంలో వెండి సింహాలు చోరీకావడం దారుణమన్నారు. ఈ ఘటనలపై శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తంచేస్తున్న భాజపా, జనసేన, ఆర్​ఎస్​ఎస్, వీహెచ్​పీ, భక్తులపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం తగదన్నారు.

ABOUT THE AUTHOR

...view details