ఎస్పీ ఆదేశాల మేరకు అవనిగడ్డ సీఐ రవికుమార్ కరోనాపై అవగాహన సమావేశం నిర్వహించారు. సబ్ డివిజన్ పరిధిలో 24/7 పోలీసులు అందుబాటులో ఉండేలా ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని తెలిపారు. అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అవసరమైతే తప్ప ప్రజలను బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
కరోనా: అవనిగడ్డలో పోలీసుల ప్రత్యేక బృందం ఏర్పాటు - Special Team for Corona in avanigadda
కరోనాపై పోరులో అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో 24/7 పోలీసులు అందుబాటులో ఉండేలా స్పెషల్ టీం ఏర్పాటు చేశామని సీఐ రవికుమార్ తెలిపారు. ప్రజలందరూ వారి సేవలు వినియోగించుకోవాలని కోరారు.
![కరోనా: అవనిగడ్డలో పోలీసుల ప్రత్యేక బృందం ఏర్పాటు Avanigadda Police Pressmeet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6476767-683-6476767-1584696460072.jpg)
అవనిగడ్డలో కరోనా కోసం స్పెషల్ టీం
కరోనా: అవనిగడ్డలో పోలీసుల ప్రత్యేక బృందం ఏర్పాటు
ఇవీ చదవండి...కడప జిల్లా రైల్వే కోడూరులో కరోనా అనుమానితుడు