ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు 'కృష్ణా' సిద్ధం

By

Published : Mar 13, 2021, 7:54 PM IST

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కృష్ణా జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని 6 మండలాల్లో.. అన్ని సౌకర్యాలు కల్పించినట్లు జిల్లా అధికారులు తెలిపారు.

mlc elections arrangements done in krishna district
కృష్ణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

రేపు జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. కృష్ణా జిల్లా మోపిదేవి మండల పోలింగ్ కేంద్రంలో 44 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు వారు పోలింగ్​లో పాల్గోనున్నారు. బూత్​లలో ఓటర్లకు తాగు నీరు, విద్యుత్, పోలీస్ బందోబస్తు సహా ఇతర సౌకర్యాలు కల్పించినట్లు తహసీల్దార్ మస్తాన్ తెలిపారు. ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

అవనిగడ్డ నియోజకవర్గం 6 మండలాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 346 మంది పురుషులు, 194 మంది స్త్రీలు పలుచోట్ల ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

మండలం ఓటర్లు
అవనిగడ్డలో 233
చల్లపల్లి 124
నాగాయలంక 50
కోడూరు 46
మోపిదేవి 44
ఘంటసాల 43
మొత్తం ఓటర్లు 540

TAGGED:

ABOUT THE AUTHOR

...view details