లాక్ డౌన్ సమయంలో రద్దు అయిన బస్సు టికెట్లు రద్దు చేసుకునే సమయాన్ని ఏపీఎస్ఆర్టీసీ మరోసారి పొడిగించింది. సోమవారం నుంచి సెప్టెంబర్ 14 వరకు సమయాన్ని ఇచ్చింది. ఏటీబీ, బస్టాండ్ కౌంటర్లలో టికెట్లు చూపించి నగదు తీసుకోవచ్చని ప్రయాణికులకు ఆర్టీసీ తెలిపింది.
టికెట్ల రద్దు గడువును ఏపీఎస్ఆర్టీసీ మరోసారి పొడిగింపు
లాక్ డౌన్లో బస్సు సేవలు నిలిచిపోవటంతో అప్పుడు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ నగదు తిరిగి చెల్లిస్తోంది. ఆ టికెట్లను రద్దు చేసుకునే సమయాన్ని మరోసారి పొడిగించింది.
apsrtc extends ticket canellation time
ఇదీ చదవండి