ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం - విజయవాడ వార్తలు

విజయవాడ సింగ్​నగర్​ బుడమేరు వంతెనపై ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. వంతెన రక్షణ గోడ ధ్వంసమై.. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

apsrtc bus missed an accident in vijayawada
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం

By

Published : Feb 5, 2021, 8:29 PM IST


విజయవాడ సింగ్​నగర్​ బుడమేరు వంతెనపై పెనుప్రమాదం తప్పింది. నూజివీడు నుండి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సు బుడమేరు కాల్వ వంతెన రక్షణ గోడను వేగంగా ఢీకొట్టింది. ఇరవై అడుగుల మేర రక్షణ గోడ ధ్వంసమైంది.

గోడ ధ్వంసమైన బ్రిడ్జ్ ఇరవై అడుగుల లోతున బుడమేరు కాల్వ ఉంది. ప్రమాద సమయంలో బస్సు పొరపాటున కాలువలో పడితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం తృటిలో తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details