ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వారి నిర్ణయాల కారణంగా... మేం ఇబ్బందులు పడుతున్నాం' - apspdcl contractors latest news

విద్యుత్తు శాఖపై యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా... తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎపీఎస్పీడీసీఎల్ గుత్తేదారుల సంక్షేమ సంఘం బాధ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే... ప్రత్యామ్నాయ పనులు చూసుకుంటామని హెచ్చరించారు.

విజయవాడలో ఎపీఎస్పీడిసీఎల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ మీడియా సమావేశం

By

Published : Oct 22, 2019, 10:30 AM IST

Updated : Oct 22, 2019, 1:47 PM IST

విజయవాడలో ఎపీఎస్పీడీసీఎల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ మీడియా సమావేశం

విద్యుత్తు వ్యవస్థపై యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని... ఎపీఎస్పీడీసీఎల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్​యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్​క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కో సబ్​స్టేషన్ నిర్వహణకు రూ.4 వేలు ఖర్చు అవుతుండగా... ప్రభుత్వం కేవలం రూ.వెయ్యి నిర్ణయిస్తూ... ఏ విధంగా టెండర్లు పిలిచిందో అర్థం కావటం లేదన్నారు. గతంలో రూ.6,500 ఇచ్చేవారని గుర్తు చేశారు. తమకు న్యాయం చేయకుంటే ప్రత్యామ్నాయ పనులు చూసుకుంటామని రమేష్​యాదవ్ హెచ్చరించారు.

Last Updated : Oct 22, 2019, 1:47 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details