చిత్తూరు జిల్లాలోని అపోలో ఆస్పత్రి పడకల సామర్థ్యాన్ని 850కి పెంచినట్లు ఆస్పత్రుల గ్రూపు సంయుక్త సంచాలకులు సంగీతా రెడ్డి తెలిపారు. కొవిడ్ మహమ్మారిపై పోరాడే ప్రయత్నాల్లో భాగంగానే అప్గ్రేడ్ చేసినట్లు పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కోవటానికి ఉమ్మడి కృషిలో భాగంగా 380 నుంచి 850 పడకలకు పెంచడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలోని తవనంపల్లె మండలంలో ఉచిత కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేశామన్నారు.
సీఎం జగన్కు అభినందనలు..
గత ఏప్రిల్ నుంచి సుమారు 1,680 మందికిపైగా కొవిడ్ రోగులకు చికిత్స అందించినట్లు వివరించారు. 3,794 మంది రోగులను పరీక్షించామని స్పష్టం చేశారు. సమీకృత పోరాటం ద్వారా కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్కు సంగీతా రెడ్డి అభినందనలు తెలియజేశారు.
ఉత్పత్తిని పెంచాలి..