కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ నిర్వహించిన వేలంలో.. ఝార్ఖండ్ కు చెందిన బ్రహ్మదిహా కోల్ బ్లాక్ను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఝార్ఖండ్ రాష్ట్రలోని గిరిదిహ్ కోల్ ఫీల్డ్లో బ్రహ్మదిహా కోల్ బ్లాక్ ఉంది. 259 ఎకరాల పరిధిలోని ఈ బ్లాక్లోని కోకింగ్ కోల్ బొగ్గును ఏపీఎండీసీ ఏడాదిపాటు మైనింగ్ చేయనుంది. ఈ బ్లాక్ నుంచి మొదటి గ్రేడ్ రకానికి చెందిన కోకింగ్ కోల్ను ఏడాదికి 0.15 మిలియన్ టన్నుల మేర తవ్వి తీసుకునేందుకు అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.
బ్రహ్మదిహా కోల్ బ్లాక్ను దక్కించుకున్న ఏపీఎండీసీ - ఏపీఎండీసీ తాజా వార్తలు
ఝార్ఖండ్ రాష్ట్ర గిరిదిహ్ కోల్ ఫీల్డ్లో ఉన్న బ్రహ్మదిహా కోల్ బ్లాక్ను వేలంలో ఏపీఎండీసీ దక్కించుకున్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. అక్కడ ఏపీఎండీసీ ఏడాది పాటు మైనింగ్ చేసుకోవచ్చాన్నారు.
బ్రహ్మదిహా కోల్ బ్లాక్ను దక్కించుకున్న ఏపీఎండీసీ