చదరంగం పోటీల్లో సత్తా చాటిన విజయవాడ క్రీడాకారులు - AP CHESS COMPETITIONS
గుడివాడలో రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలను రెండురోజులపాటు నిర్వహించారు. ఈ పోటీల్లో విజయవాడకు చెందిన ముగ్గురు క్రీడాకారులు విజేతలుగా నిలిచారు.
![చదరంగం పోటీల్లో సత్తా చాటిన విజయవాడ క్రీడాకారులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3644606-212-3644606-1561345995330.jpg)
ap-chess-competition-completed
కృష్ణాజిల్లా గుడివాడ ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు ముగిసాయి. రెండురోజులపాటు జరిగిన ఈపొటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో మళ్లేశ్వరావు, సుప్రీత, రణదీర్ విజేతలుగా నిలిచారు. వారికి స్టేడియం కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందించారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.