ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా వైద్యం గురించి వైద్యులు ప్రచారం చేయడం తగదు: ఏపీ వైద్య మండలి

శాస్త్రీయ ఆధారాలు లేకుండా... కరోనా చికిత్సలో ఉపయోగించే మందులు, విధానాల గురించి వైద్యులు ప్రచారం చేయడం మంచిది కాదని రాష్ట్ర వైద్య మండలి సూచించింది. ఈ మేరకు వైద్య మండలి ఛైర్మన్‌ డా. సాంబశివారెడ్డి, రిజిస్ట్రార్‌ డా.బీకే నాయక్‌ ఓ ప్రకటన జారీచేశారు. కరోనా మందుల గురించి బహిరంగంగా చెబితే... ప్రజల్లో ఆందోళన నెలకొంటుందని వ్యాఖ్యానించారు.

By

Published : Jun 17, 2021, 12:01 PM IST

andhraprahesh medical council fire on doctors about corona treatment
వైద్య మండలి ఛైర్మన్‌ డా. సాంబశివారెడ్డి

మోనోక్లోనల్‌ యాంటీబాడీ కాక్‌టైల్‌ మెడిసిన్‌ వంటి వాటి గురించి పేర్కొనడం, ప్రాచుర్యం కల్పించడం సరైన పద్ధతి కాదని అధికారులు పేర్కొన్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చి రూపొందించిన ప్రమాణాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్‌ చికిత్సలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయని తెలిపారు. బాధితులకు చికిత్స అందించే క్రమంలో గమనించిన కొత్త అంశాలను సదస్సులు, మెడికల్‌ జర్నల్స్‌ ద్వారా వెలుగులోకి తీసుకువస్తే వాటిని వెల్లడించే అవకాశం ఉందని డా.సాంబశివరెడ్డి స్పష్టం చేశారు.

కరోనా చికిత్స మందులు, వైద్య విధానం గురించి వైద్యులు ప్రచారం చేయడం తగదని ఏపీ వైద్య మండలి అభిప్రాయపడింది. ఇలా చేయడం ద్వారా ప్రజల్లో ఆందోళన నెలకొంటుందని వెల్లడించింది. బాధితులకు చికిత్స అందించే క్రమంలో గమనించే కొత్త విషయాలను అధికారికంగా నిర్ణయించి... మెడికల్ జర్నల్స్ ద్వారా సమాచారం అందిస్తామని స్పష్టం చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details