ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్త ఐటీ విధానం.. 55 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కసరత్తు!

ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఐటీ విధానాన్ని రూపోందించింది. రాష్ట్రంలో 55 వేల ఉద్యోగాల కల్పన, దేశంలో పెట్టుబడుల్లో రాష్ట్రానికి అగ్రస్థానం దక్కేలా లక్ష్యాలను నిర్దేశించింది. నూతన విధానంలో.. పెట్టుబడుల ఆకర్షణ కోసం ఐటీ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు అగ్రస్థానం కల్పించాలని నిర్ణయించింది.

By

Published : Jul 3, 2021, 5:31 PM IST

Andhra pradesh government proposed new industrial policy
Andhra pradesh government proposed new industrial policy

కొత్త ఐటీ విధానానికి ప్రభుత్వం రూపకల్పన

వచ్చే మూడేళ్లలో 55 వేల ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కొత్త ఐటీ విధానానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. 2025 నాటికి దేశంలో ఐటీ పరిశ్రమ 350 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశముందని ఇందులో సింహభాగం ఏపీకి దక్కేలా మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించారు. క్లౌడ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డాటా అనాలసిస్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోనూ.. ఐటీ ఆధారిత పౌర సేవల్ని విస్తృతం చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో 3 ఐటీ కాన్సెప్ట్‌ సిటీలు సిద్ధం చేసి.. మౌలిక సదుపాయలు కల్పించనున్నారు. డిజిటల్ లైబ్రరీలు, పంచాయతీల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయడం లాంటి కార్యాచరణ చేపట్టనున్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్సింగ్ డేటా బేస్‌తో పాటు వర్క్‌ఫ్రమ్ ఎనీవేర్ నినాదంతో మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్టార్టప్‌లను ప్రోత్సహించేలా కార్యాచరణను సిద్ధంచేశారు. ఐటీ పరిశోధన విశ్వవిద్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

నూతన ఐటీ విధానం ద్వారా మూడేళ్లలో 55 వేల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే పన్నుల రూపేణా ఏడాదికి 783 కోట్ల రూపాయల వరకూ ఆదాయం వచ్చే అవకాశముందని భావిస్తోంది. అలాగే ప్రత్యక్ష ఉద్యోగాల ద్వారా 2200 కోట్ల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలు రాష్ట్రంలో జరిగవచ్చని అంచనా. అలాగే ఐటీఈకో సిస్టం ద్వారా పరోక్షంగా 1.6 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించే అవకాశముందని భావిస్తోంది.

ఐటీ పరిశ్రమలను ఆకట్టుకునేందుకు కొత్త విధానంలో ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. మహిళలు, బీసీలు, ఎస్టీ, ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు 15 శాతం మేర, మిగిలిన వారికి 10 శాతం మేర ఉద్యోగుల వార్షిక వేతనంలో రాయితీలను ప్రకటించారు. పరిశ్రమలకు వర్తింప చేసే విద్యుత్‌ టారిఫ్‌ను ఐటీ సంస్థలకు అమలు చేయాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి:

ఎంపీ రఘురామ ఫిర్యాదుపై కేంద్ర హోంశాఖ స్పందన.. నివేదిక ఇవ్వాలని సీఎస్​కు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details