అఖిల భారత గంగపుత్ర మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన వెంకటేశ్వర్లు.... బెస్త, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుని మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణా జిల్లా విజయవాడలోని మంత్రి నివాసంలో ఆయన్ను ఘనంగా సన్మానించారు. అనంతరం రాష్ట్రంలో మత్స్యకారులు బెస్త కులస్థుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్టంలో బెస్త కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్కు, మంత్రి అప్పలరాజుకు మహాసభ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
రూ.500 కోట్లు కావాలి..
బెస్త కార్పొరేషన్కు రూ. 500 కొట్లు కేటాయించాలని మంత్రిని కోరినట్లు వెంకటేశ్వర్లు బెస్త తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, పంచాయితీలు ఆధ్వర్యంలో ఉండే నీటి వనరులను నామినల్ ఫీజుతో చేపల పెంపకం నిమిత్తం బెస్తలకు అప్పగించాలని మంత్రిని అడిగినట్లు ఆయన పేర్కొన్నారు.
ఫిష్ స్టాల్స్ ఏర్పాటు చేేయండి..
ప్రతి మండలం, పట్టణాల్లో ప్రభుత్వమే చేపల అమ్మకానికి స్టాల్స్ నిర్మించాలన్నారు. పోషక విలువలు అధికంగా గల చేపలు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. చేపల సొసైటీలకు పూచికత్తు లేకుండా ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.