ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం సేవించి వాహనాలు నడిపిన 38 మందికి జైలు

మద్యం సేవించి.. వాహనాలు నడిపిన 38 మందిపై విజయవాడ న్యాయస్థానం చర్యలు తీసుకుంది. తనిఖీల్లో మద్యం తాగి, వాహనాలు నడిపినట్లు రుజువైన వారికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

By

Published : Feb 5, 2021, 7:27 PM IST

drunken drive
డ్రంక్ అండ్ డ్రైవ్​లో దొరికిన వారిపై చర్యలు

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 38 మందికి విజయవాడ న్యాయస్థానం జైలు శిక్ష , జరిమానా విధించింది. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డైవ్ చేపట్టారు. డ్రైవ్​లో నమోదు చేసిన 38 కేసుల్లో 7వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ కె. సురేష్ బాబు జైలు మరియు రూ.76,000ల జరిమానా విధించారు. వీటిల్లో 3 కేసుల్లో 10 రోజుల జైలు శిక్ష, జరిమానా, 5 కేసుల్లో 7 రోజుల జైలు శిక్ష, జరిమానా, 3 కేసుల్లో 5 రోజుల జైలు శిక్ష, జరిమానా, 8 కేసుల్లో 4 రోజుల జైలు శిక్ష, జరిమానా, 3 కేసుల్లో 3 రోజుల జైలు శిక్ష, జరిమానా, 13 కేసుల్లో 2 రోజుల జైలు శిక్ష.. జరిమానా, 1 కేసులో 1 రోజు జైలుశిక్ష.. జరిమానా, 1 కేసులో జరిమానా విధిస్తూ 7వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు.

కేసుల సంఖ్య శిక్ష
3 కేసులు 10 రోజులు జైలు శిక్ష, జరిమానా
5 కేసులు 7 రోజులు జైలు శిక్ష, జరిమానా
3 కేసులు 5 రోజులు జైలు శిక్ష, జరిమానా
8 కేసులు 4 రోజులు జైలు శిక్ష, జరిమానా
3 కేసులు 3 రోజులు జైలు శిక్ష, జరిమానా
13 కేసులు 2 రోజులు జైలు శిక్ష, జరిమానా
1 కేసు ఒక రోజు జైలు శిక్ష, జరిమానా
1 కేసు జరిమానా

ABOUT THE AUTHOR

...view details