ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 10, 2020, 1:29 PM IST

ETV Bharat / state

ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి కార్మికుడు మృతి

ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన విజయవాడ నగర శివారు ఎల్​బీఎస్ నగర్​లో జరిగింది. ఈ ఘటనపై నున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి కార్మికుడి మృతి
ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి కార్మికుడి మృతి

పొట్ట కూటి కోసం పనికి వచ్చిన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి మృతి చెందిన ఘటన విజయవాడ నగర శివారు ఎల్​బీఎస్​నగర్​లో జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం రెండో అంతస్తుపై నుంచి ప్రమాదవశాత్తు పడిపోయాడు. భవనిర్మాణ కార్మికుడుకి తీవ్రగాయాలై మృతి చెందాడు. మృతుడు సింగ్ నగర్ వాంబేలానీకి చెందిన శ్రీనుగా గుర్తించారు. నున్న పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details