లారీ దూసుకెళ్లిన ఘటనలో 92 గొర్రెలు మృతి
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్మహమ్మద్పేట వద్ద ఓ లారీ గొర్రెల మంద పైకి దూసుకెళ్లింది.ఈ ఘటనలో92జీవాలు మృతి చెందాయి.తెలంగాణ రాష్ట్రం కోదాడ నుంచి చిల్లకల్లు సంతకు గొర్రెలను తీసుకొస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కోరుతున్నారు.