విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ అధికారి మురళీగౌడ్పై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు ఏక కాలంలో 6 చోట్ల తనిఖీలు నిర్వహించారు. మురళీగౌడ్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో... అసిస్టెంట్ సిటీ ప్లానర్గా పనిచేసే సమయంలో వచ్చిన ఫిర్యాదు మేరకు.. అనిశా అధికారులు తిరుపతి నుంచి వచ్చి సోదాలు చేశారు. ఇప్పటివరకూ... హైదరాబాద్ లో 3 అంతస్తుల భవనం, నంద్యాలలో ఒక ఇల్లు, ఓర్వకల్లులో 8 ఎకరాల వ్యవసాయ భూమి, తిరుపతిలో ఇళ్ల స్థలాలు గుర్తించారు. రూ.14 లక్షల నగదు, లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, ఒక కారు.. 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇష్టారాజ్యంగా అనుమతులు