ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. యువతి పాలిట శాపం - విజయవాడ తాజా వార్తలు

అతి వేగం ఓ నిండు ప్రాణం బలితీసుకుంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం యువతి పాలిట శాపంగా మారింది. విజయవాడ నగరశివారులోని రామవరప్పాడు కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Girl died due to lorry driver negligence
లారీ ఢీకొని యువతి మృతి

By

Published : Oct 2, 2020, 7:22 PM IST

కృష్ణ జిల్లా విజయవాడ నగర శివారులోని రామవరప్పాడు కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతిచెందింది. ద్విచక్రవాహనంపై విజయవాడ వైపు వెళుతుండగా వెనక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. మృతురాలు సింగ్​నగర్ రాజరాజేశ్వరిపేటకు చెందిన వాయిల రేవతిగా పోలీసులు గుర్తించారు. లారీ చోదకుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: పోలీసు కస్టడీలో నిందితుడి మృతి

ABOUT THE AUTHOR

...view details