ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలో మరో 74 మందికి కరోనా పాజిటివ్ - covid 19 death stats telangana

తెలంగాణలో మరో 74 మందికి కరోనా పాజిటివ్ నిరార్ధణ అయింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2499 కి చేరింది. మరో ఆరుగురు కరోనాతో మృతి చెందారు.

తెలంగాణలో మరో 74 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణలో మరో 74 మందికి కరోనా పాజిటివ్

By

Published : May 30, 2020, 10:36 PM IST

తెలంగాణలో మరో 74 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయింది. కరోనాతో మరో ఆరుగురు చనిపోయారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 41, రంగారెడ్డిలో 5, సంగారెడ్డిలో ముగ్గురికి, మహబూబ్​నగర్, జగిత్యాల జిల్లాల్లో ఇద్దరికి, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ అర్బన్, వికారాబాద్, మేడ్చల్, నాగర్​కర్నూల్​, నిజామాబాద్​ జిల్లాల నుంచి ఒక్కొక్కరి చొప్పన కరోనా కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల్లో 9 మంది, విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 2,499కి చేరాయి. ఆస్పత్రిలో చికిత్స నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,412 మంది డిశ్ఛార్జి అయ్యారు. మరో 1,010 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 77కి చేరింది.

ఇదీ చదవండి: ఎస్​ఈసీ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: ఏజీ

ABOUT THE AUTHOR

...view details