ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణలో కొత్తగా 623 కరోనా కేసులు

By

Published : Jul 29, 2021, 8:17 PM IST

తెలంగాణలో కొత్తగా 623 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 746 మంది బాధితులు కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

623-new-corona-cases-has-reported-in-telangana
తెలంగాణలో కొత్తగా 623 కరోనా కేసులు

తెలంగాణలో తాజాగా 623 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,43,716కు చేరింది. 24 గంటల వ్యవధిలో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,796కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 746 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,30,732కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 9,188 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో కొందరు హోం ఐసోలేషన్​లో ఉండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 97.98 శాతంగా నమోదైంది. ఇవాళ 1,11,947 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,06,462 పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్​సీల్లో చేయగా మిగతా 5,485 టెస్టులు ప్రైవేట్​లో నిర్వహించారు.

ఇదీ చదవండి:corona cases: కొత్తగా 2,107 కరోనా కేసులు, 20 మరణాలు

ABOUT THE AUTHOR

...view details