కరోనా బాధితులకు సహకారం అందించేందుకు ఏపీసీసీ తరుపున కొవిడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు. కష్ట కాలంలో అధికార పార్టీ నాయకులు మొహం చాటేస్తుండటం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు.
సీఎం పట్టించుకోకపోవడం దారుణం..
కరోనా వ్యాప్తి నియంత్రణను అడ్డుకోవడంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్ ఇద్దరూ విఫలమయ్యారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పది , ఇంటర్ పరీక్షలు నిర్వహించొద్దని ఒకవైపు తల్లిదండ్రులు కోరుతున్నా, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
చేతకాకుంటే చెప్పండి..