ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 22, 2020, 8:02 PM IST

ETV Bharat / state

ఇకపై గుమిగూడితే చట్టపరమైన చర్యలు తప్పవు..!

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. మార్చి 31 వరకు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు.

144 section in krishna district
144 section in krishna district

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కృష్ణా జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఆదివారం నుంచి మార్చి 31 వరకు 144 సెక్షన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో నలుగురైదుగురు ఎక్కడ గుమిగూడరాదని ఆదేశించారు. ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details