ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 28, 2021, 6:28 PM IST

ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 117 కరోనా కేసులు నమోదు

రాష్ట్రంలో కొత్తగా 117 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కొవిడ్ నుంచి మరో 66 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది. రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు కోటీ 39 లక్షలు దాటాయని వివరించింది.

రాష్ట్రంలో కొత్తగా 117 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 117 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మెుత్తం కేసుల సంఖ్య 8లక్షల 89వేల 916కి చేరింది. ఇప్పటివరకు వైరస్​ బారినపడి 7వేల 169 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి మరో 66 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మెుత్తం కోలుకున్న 8.82 లక్షల మందికి పైగా చేరింది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 39 వేల 122 కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా నిర్ధరణ పరీక్షలు కోటీ 39 లక్షలు దాటాయి.

ABOUT THE AUTHOR

...view details