ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 4, 2021, 8:29 PM IST

ETV Bharat / state

మాగల్లులో ఘనంగా 108 అడుగుల శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన

కృష్ణా జిల్లా నందిగామలోని మాగల్లు గ్రామంలో.. 108 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఐదు రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు.. స్వామివారి కల్యాణంతో ముగిశాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

108 feet long sri lakshmi narasimha swamy idol inaugrated at magallu in krishna district
మాగల్లులో ఘనంగా 108 అడుగుల శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం ప్రతిష్టాపన

కృష్ణా జిల్లా నందిగామలోని మాగల్లు గ్రామంలో.. ప్రపంచంలోనే ఎత్తైన 108 అడుగుల శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి ఆలయం ఎదుట.. భారీ ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించిన అనంతరం ఆలయంలో విగ్రహాలను ప్రతిష్టించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

ఐదు రోజులుగా జరుగుతున్న ప్రతిష్ట మహోత్సవాలు.. విగ్రహ ప్రతిష్ట, స్వామివారి కల్యాణాలతో ముగిశాయి. శ్రీ లలిత కామేశ్వరి పీఠం స్వామీజీ ఆదిత్యనంద భారతి స్వామి.. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకునేందుకు.. పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details