కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం గరిశపూడి సమీపంలోని 216 జాతీయ రహదారిపై... 10 అడుగుల కొండచిలువను స్థానికులు గుర్తించారు. వాహనాల శబ్ధానికి అటూ, ఇటూ తిరుగుతూ... కొండచిలువ హడావుడి చేసింది. చివరకు దాని తలపై నుంచి ఆటో వెళ్లడంతో గాయాలయ్యాయి. భయాందోళనకు గురైన స్థానికులు దాన్ని చంపివేశారు. ఆ ప్రాంతంలో అనేక విషసర్పాలు తిరుగుతుంటాయని... కొండచిలువను చూడటం ఇదే మొదటిసారని స్థానికులు చెప్పారు. కొండచిలువ వల్ల ప్రమాదం పొంచి ఉంటుందన్న భయంతో చంపేసినట్లు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదకు ఉప్పుటేరు ద్వారా ఇక్కడికి రావొచ్చని భావిస్తున్నారు.
వామ్మో ఎంత పెద్ద కొండ చిలువో...! - కృష్ణా జిల్లాలో 10 అడుగుల కొండచిలువ
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం గరిశపూడిలో 10 అడుగుల కొండచిలువ హల్చల్ చేసింది. భయంతో స్థానికులు దాన్ని చంపేశారు. ఆ ప్రాంతంలో అనేక సర్పాలు తిరుగుతాయని... కొండ చిలువను చూడటం ఇదే మొదటిసారని స్థానికులు చెప్పారు.
గరిశపూడిలో 10 అడుగుల కొండచిలువ