ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఒకే కాన్పులో ముగ్గురు, ఆనందంలో తల్లిదండ్రులు

By

Published : Aug 20, 2022, 8:45 AM IST

కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఉడిమూడికి చెందిన మహిళ ఒకే కాన్పులో ముగ్గురికి జన్ననిచ్చింది. అందులో ముగ్గురూ ఆడపిల్లలే కావడం విశేషం.

3 babies
3 babies

సాధారణంగా ఒకే కాన్పులో ఒకరు లేదా ఇద్దరు జన్నించడం చూస్తుంటాం అలాంటిది..కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఉడిమూడికి చెందిన మహిళ.. ఒకే కాన్పులో ముగ్గురికి జన్ననిచ్చింది. అందులో ముగ్గురూ ఆడపిల్లలే కావడం విశేషం. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను రాజోలులోని శ్రీలతా అస్పత్రిలో చేర్పించగా..శస్త్రచికిత్స చేసి పిల్లలకు ప్రాణం పోశారు. పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారని వ్యాక్సినేషన్‌ కూడా పూర్తిచేశామని వైద్యులు తెలిపారు. ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలకు జన్మనివ్వడం తమకెంతో ఆనందంగా ఉందని భర్యా భర్తలు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details