ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా

By

Published : Jul 22, 2020, 4:44 PM IST

Published : Jul 22, 2020, 4:44 PM IST

Updated : Jul 22, 2020, 5:17 PM IST

ysrcp mla ambati rambabu tested corona positive
ysrcp mla ambati rambabu tested corona positive

16:41 July 22

గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాసనసభ్యుడు అంబటి రాంబాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించారు.

ఇవాళ ఉదయం తనకు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. జలుబు, జ్వరం లక్షణాలు కనిపించకపోయినా.. పాజిటివ్ రావటం ఆశ్ఛర్యంగా ఉందన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. పాజిటివ్ వచ్చిందని తెలియగానే హోం క్వాంరటైన్​కు వెళ్లినట్లు తెలిపారు. చాలామంది పార్టీ కార్యకర్తలు అభిమానులు ఫోన్లు చేస్తున్నారని... అందరి అభిమానంతో త్వరలోనే కోలుకుంటానన్నారు.  

ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజులు క్రితం కరోనా బారిన పడిన ఎమ్మెల్యే కిలారి రోశయ్య కోలుకున్నారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్ హోం క్వాంరటైన్​లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి:చీరాల దళిత యువకుడు మృతి....దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం

Last Updated : Jul 22, 2020, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details