ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 4, 2019, 12:15 PM IST

Updated : Jul 4, 2019, 1:57 PM IST

ETV Bharat / state

తెదేపా కార్యకర్తపై ప్రత్యర్థులు కొడవలితో దాడి

తెదేపా శ్రేణులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెంలో తెదేపా కార్యకర్త అల్లాఉద్దీన్​పై వైకాపా నేతలు కొడవలితో దాడి చేశారు.

తెదేపా కార్యకర్తపై... కొడవలితో తెగబడ్డ వైకాపా నేతలు

తెదేపా కార్యకర్తపై... కొడవలితో తెగబడ్డ వైకాపా నేతలు

గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెంలో తెదేపా కార్యకర్తపై వైకాపా నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. తురకపాలెం గ్రామానికి చెందిన షేక్ అల్లాఉద్దీన్​పై ప్రత్యర్థులు కొడవలితో దాడి చేయడానికి ప్రయత్నించారు. తప్పించుకోబోయిన అల్లాఉద్దీన్ చేతికి తీవ్రగాయాలయ్యాయి. అల్లా ఉద్దీన్​ను గ్రామస్థులు సకాలంలో కాపాడారు. ఈ ఘటన అనంతరం ప్రత్యర్ధులు పారిపోయారు. అల్లాఉద్దీన్​ మాచవరం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

Last Updated : Jul 4, 2019, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details