ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువకుడి ఆత్మహత్య... స్నేహితులే హత్య చేశారని కుంటుంబసభ్యుల ఆరోపణ - sathainapally news

సతైనపల్లిలో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సోదరుడిది ఆత్మహత్య కాదని స్నేహితులే హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

suicide
యువకుడు ఆత్మహత్య

By

Published : Jun 24, 2021, 11:53 AM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని చెంచుకాలనీలో అంగదల వెంకటేష్(25) అనే యువకుడు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. తన తమ్ముడిని అతని స్నేహితులే హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడు వెంకటేష్, కన్నయ్య, మైనులు ముగ్గురు స్నేహితులు. వారిలో కన్నయ్యకు పట్టణంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆ మహిళ భర్త ఇటీవల తన ఇంట్లో చోరీ జరిగిందని.. కన్నయ్యపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆ కేసులో వెంకటేష్ పేరు లేనప్పటికీ పోలీసులు దర్యాప్తు పేరుతో.. తన తమ్ముడు వెంకటేష్​ను రోజూ స్టేషన్​కు పిలుస్తున్నారు.బుధవారం కూడా స్టేషన్​కు వెళ్లాం. గురువారం తెల్లవారుజామున నా సోదరుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఉరి వేసుకున్న చీర కూడామాది కాదు. అతన్ని స్నేహితుడు కన్నయ్య హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడు. - శ్రీనివాస్, మృతుని సోదరుడు.

ఇదీ చదవండి:NRI HOSPITAL: మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో కలకలం

ABOUT THE AUTHOR

...view details