ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దుగ్గిరాలలో రోడ్డు ప్రమాదం.. ఒకరు దుర్మరణం

By

Published : Dec 7, 2020, 2:31 PM IST

ద్విచక్రవాహనదారుడు కారును తప్పించబోయి ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతను మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాలలో చోటు చేసుకుంది. మృతుడు తెనాలికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

young man dead in road accident at duggirala
దుగ్గిరాలలో రోడ్డు ప్రమాదం ఒకరు దుర్మరణం

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ప్రమాదం జరిగింది. కారును తప్పించే క్రమంలో ద్విచక్రవాహనదారుడు.. రేపల్లె నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు తెనాలికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details