ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చెట్టుకు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య

By

Published : Nov 3, 2020, 3:06 PM IST

గుంటూరు జిల్లా తాడికొండ పొలాల్లో ఓ యువకుడు ఉరి వేసుకుని మృతి చెందడం కలకలం సృష్టించింది. అతడు మృతి చెందిన ప్రదేశంలో పురుగుల మందు డబ్బా, ఒంటిపై గాయాలు కనిపంచడంతో యువకుడి మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మృతి చెందిన యువకుడు
మృతి చెందిన యువకుడు

గుంటూరు జిల్లా తాడికొండ పొలాల్లో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు మృతి చెందిన ప్రదేశంలో పురుగు మందుల డబ్బా కనిపించింది. అంతే గాక అతని ఒంటిపై గాయాలు ఉన్నాయి. మృత దేహం నుంచి దుర్వాసన వచ్చింది.

నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు బావిస్తున్నారు. యువకుడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న కారణంగా... మృత దేహాన్ని పంచానామా నిమిత్తం పోలీసులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

అమెరికా పంపిస్తానంటూ రూ.13 లక్షలు స్వాహా...

ABOUT THE AUTHOR

...view details