గుంటూరు జిల్లా తెనాలి మండలంలో జగ్గడిగుంట పాలెంలోని కొవిడ్ హెల్త్ కేర్ సెంటర్లో దాదాపు 700 మంది పైగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. వారి ఆహ్లాదం కోసం సాయంత్రం వేళ చిత్ర ప్రదర్శనలు చేస్తున్నారు.
ప్రతి రోజు ఉదయాన్నే..
కరోనా నియంత్రణలో భాగంగా యోగా గురువు పతంజలి శ్రీనివాస్ బాధితులతో యోగాసనాలు వేయిస్తున్నారు. రోజు ఉదయం 6.30 నిమిషాల నుంచి దాదాపు గంట సమయం వరకు యోగాసనాలు వేయించినట్లు యోగా గురువు తెలిపారు.