గుంటూరులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు,భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నాలక్ష్మినారాయణ వెల్లడించారు.శాంతిభద్రతలు,ఇసుక పాలసీ,దేవాలయభూముల అన్యాక్రాంతం వంటి అంశాలను నిరసిస్తూ సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.గురజాల ఆర్డీవో కార్యాలయ సమీపంలోని మైదానంలో ఈ సభ జరుగుతుందని చెప్పారు.ఈ సభకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇంచార్జ్ సునిల్ దేవ్ ధర్ హాజరవుతారని కన్నా తెలిపారు.భాజపాలో చేరుతున్న వారిపై,వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు..
గుంటూరులో భాజపా భారీ బహిరంగ సభ:కన్నా లక్ష్మినారాయణ - latest news on kanna speech
గుంటూరులో భారీ బహిరంగ సభను నిర్వహించి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మినారాయణ ప్రకటించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా
భాజపాలో చేరితే వేధింపులకు పాల్పడతారా?: కన్నా
TAGGED:
latest news on kanna speech