వైకాపా ప్రభుత్వం వచ్చాక అరాచకం పెరిగిపోయిందని.. తెదేపా కార్యకర్తలపై వరుస దాడులు జరుగుతున్నాయని.. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. వీటిని అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని డిమాండ్ చేశారు. మాచవరం మండలం చెన్నాయపాలెేనికి చెందిన యలమంద నాయక్ను అరెస్టు చేసిన సమయంలో దారుణంగా కొట్టారని.. ఆరోపించారు.
వర్ల రామయ్యతో కలిసి యలమంద నాయక్ను తీసుకొని గ్రామీణ ఎస్పీని ఆలపాటి రాజేంద్రప్రసాద్ కలిశారు. యలమంద నాయక్పై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని.. వారి పై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు కోరారు. మాచవరం స్టేషన్ నుంచి మాచర్ల దాకా రక్తం వచ్చేట్లు సివిల్ డ్రస్లో ఉన్న పోలీసులు కొట్టారని.. ఆ సమయంలో ఎస్సై కాపాడకపోతే.. తన ప్రాణాలు పోయేవని యలమంద నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై రక్షించారన్న కృతజ్ఞతతో జరిగిన విషయాన్ని మేజిస్ట్రేట్కు చెప్పలేదని యలమంద నాయక్ తెలిపారు.