మహిళలను బెదిరించి వారి దగ్గర ఉన్న నగదును దోచుకెళ్తున్న దొంగల ముఠాను గుంటూరు లాలాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారి నుంచి లక్ష 47 వేల నగదు, బ్లేడ్, చాకులను స్వాధీనం చేసుకున్నారు.
డబ్బుల కోసం గుంటూరుకు..
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంకు చెందిన జింకా రాజేశ్వరి వ్యవసాయ పనుల నిమిత్తం డబ్బులు అవసరమై గుంటూరు జిల్లా కేంద్రానికి వచ్చారు. తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలను తనఖా పెట్టి రూ. 2 లక్షల 50 వేల నగదు తీసుకున్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరే ముందు దుకాణంలో పండ్లు కొంటుండగా గుర్తు తెలియని మహిళలు సంచిని కత్తిరించి నగదును దోచుకెళ్లారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు..