మంగళగిరిలో ఓ యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతడిని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను హోమ్ ఐసోలేషన్లో ఉంచారు. కుటుంబసభ్యులకు నిత్యావసర సరుకులు అందించాల్సిన వాలంటీర్లు పట్టించుకోవడం మానేశారు. తమకు కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరినా అధికారులు ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి తాగునీటి క్యాన్ కోసం బయటకు వచ్చాడు. గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
క్వారంటైన్ సెంటర్లో నిర్లక్ష్యం.. అంబులెన్స్లో మహిళ మృతి - మంగళగిరిలో మహిళ మృతి న్యూస్
గుంటూరు జిల్లా మంగళగిరిలో అధికారుల నిర్లక్ష్యంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. హోమ్ ఐసోలేషన్లో ఉన్న ఆ కుటుంబాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరకు మహిళ ప్రాణాలు గాలిలో కలిశాయి.
![క్వారంటైన్ సెంటర్లో నిర్లక్ష్యం.. అంబులెన్స్లో మహిళ మృతి క్వారంటైన్ సెంటర్లో నిర్లక్ష్యం.. అంబులెన్స్లో మహిళ మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8206700-996-8206700-1595947216172.jpg)
క్వారంటైన్ సెంటర్లో నిర్లక్ష్యం.. అంబులెన్స్లో మహిళ మృతి
నీళ్ల కోసమే బయటకొచ్చామని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. తమ ఇంట్లో అనారోగ్యంతో మహిళ ఉందని చెప్పినా.. పోలీసులు కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్ సెంటర్కు తరలించారు. గత రాత్రి ఆ మహిళకే.. గుండెనొప్పి రావడంతో అంబులెన్స్లో విజయవాడ తీసుకెళ్లారు. మార్గ మధ్యలోనే మహిళ మృతి చెందింది. అధికారుల నిర్లక్ష్యంతోనే మహిళ ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.